
తాజా వార్తలు
తెలంగాణలో ‘పది’ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని విద్యాశాఖ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక్కో పరీక్షకు మధ్య 2 రోజుల విరామం ఉండనుందని విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8న ఆంగ్లం మొదటి పేపర్తో మొదలయ్యే పరీక్షలు 29వ తేదీన సాంఘిక శాస్త్రంతో ముగియనున్నాయి.
Tags :
జిల్లా వార్తలు