
తాజా వార్తలు
కేసీఆర్ దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్ 29న దీక్షా దివస్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విటర్ ద్వారా ప్రజలకు దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షా దివస్ స్ఫూర్తిని, జ్హాపకాలు, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం. యావత తెలంగాణ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన దీక్ష’’ అంటూ భావోద్వేగ భరిత పోస్టు చేశారు. ఆ నాటి కేసీఆర్ ఫోటోలను సైతం ట్విటర్లో పంచుకున్నారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు