
తాజా వార్తలు
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో ఆరునెలల పాటు సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సస్పెన్షన్ పొడిగింపు ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఆయన్ను గతంలో విధుల్లోంచి తొలగించింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది.
ఇవీ చదవండి..
‘నా అరెస్ట్కు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోంది’
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేసిన హైకోర్టు
Tags :