
తాజా వార్తలు
ఏపీ..ఏక్రగీవాలకు ఇచ్చే మొత్తం పెంపు
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. జనాభా ప్రాతిపదికన రూ.20లక్షల వరకు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు, 10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చదవండి..
ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ అత్యవసర భేటీ
మదనపల్లె హత్యలు: సబ్జైలుకు దంపతులు
ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
Tags :