
తాజా వార్తలు
వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔట్..ఆధిక్యం 133
ఇంటర్నెట్డెస్క్: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయింది. 26వ ఓవర్లో ఓపెనర్ హ్యారిస్ (38)ను శార్దూల్ ఔట్ చేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన హ్యారిస్ వికెట్కీపర్ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన సుందర్.. అర్ధశతకానికి చేరువవుతున్న డేవిడ్ వార్నర్ (48)ను బోల్తాకొట్టించాడు. చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వార్నర్ సమీక్షకు వెళ్లినా ఔట్ అనే తేలింది. కాగా, ఓవర్నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. క్రీజులో లబుషేన్ (6), స్మిత్ (3) ఉన్నారు. ఆసీస్ 133 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇదీ చదవండి
కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్