
తాజా వార్తలు
కుల సంఘాలను కేసీఆర్ మోసం చేశారు: బండి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐఎస్ సదన్లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల సంఘాల భవనాలు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఇప్పటి వరకు ఎన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్కు కుల సంఘాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కులాల పేరుతో, వర్గాలతో చీల్చే ప్రయత్నం చేయకుండా అందరూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భాజపాను గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ తెస్తారని విమర్శించారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ను డల్లాస్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.. చేశారా? అని ప్రశ్నించారు. పేదలు వర్షాలకు తడుస్తుంటే.. సీఎం కేసీఆర్ రూ.100 కోట్లతో ప్రగతిభవన్ కట్టుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఈనెల 28న కేసీఆర్ చెప్పే పిట్టకథలు నమ్మితే మరోసారి మోసపోతారని ఓటర్లకు సూచించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
