
తాజా వార్తలు
ప్రతి హిందువు భాగస్వామి కావాలి: బండి
హైదరాబాద్: శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో బోరబండలో జరిగిన జనజాగరణ నిధి సేకరణ కార్యక్రమంలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా నిధి సేకరణ చేపట్టామని తెలిపారు. ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామరాజ్య స్థాపనకు ప్రతీకగా ఈ కార్యక్రమం జరగబోతోందన్నారు. దేశ సంస్కృతి, మూలాలను చాటిచెప్పడమే రామ మందిర నిర్మాణం ఉద్దేశమన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడిగా నిధి సేకరణలో భాగస్వామి అవుతున్నట్టు చెప్పారు. జన జాగరణ నిధి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి...
గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష
డీపీఆర్లు ఇస్తే బండారం బయటకు..: బండి సంజయ్