
తాజా వార్తలు
తెలంగాణలో 2వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు వారీ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,055 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవీ చదవండి
Tags :