
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 111 కేసులు నిర్ధారణ కాగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,152 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 97 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,369 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,29,75,961 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇవీ చదవండి..
అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఎమ్మెల్యే ఆనం
నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Tags :