
తాజా వార్తలు
ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొవిడ్ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 87వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో కరో వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1940 ఆరోగ్య కేంద్రాల్లో తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఐస్లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, వాక్ ఇన్ ఫ్రీజర్ గదుల ఏర్పాటు కారణంగా 1659 చోట్ల వ్యాక్సిన్ వయల్స్ కార్టన్లను వైద్యారోగ్యశాఖ భద్రపరిచింది. సమీపంలోని మిగతా కేంద్రాలకు వ్యాక్సిన్ను క్యారియర్ బాక్సుల్లో తరలించాలని నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించారు.
వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్ యాప్ ద్వారా సంక్షిప్త సమాచారం పంపారు. వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు.
ఇవీ చదవండి..
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
2.03 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు..