
తాజా వార్తలు
గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు: సజ్జనార్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. కొండాపూర్ డివిజన్లో హఫీజ్పేట ప్రేమ్నగర్, కూకట్పల్లి, జగద్గిరిగుట్టతోపాటు పలు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించి పోలింగ్ పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ స్వే్చ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ సజ్జనార్ కోరారు.
Tags :