
తాజా వార్తలు
ఏపీ సీఎస్తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటీ
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటీ అయింది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్కు వినతిపత్రం అందజేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు పాల్గొనలేమని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు సీఎస్ను కలిసి 9 పేజీల వినతిపత్రం అందజేశారు.
టీకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ విధుల్లో పాల్గొంటున్నామని, కేవలం టీకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఎన్నికల వాయిదా కోరుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం
నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం