
తాజా వార్తలు
కొత్త కార్పొరేటర్ల పేరుతో గెజిట్ జారీ
హైదరాబాద్: తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్లో పొందుపరిచారు. ఇవాళ్టి తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గెజిట్ను జారీ చేశారు. 150 డివిజన్ల నుంచి ఎన్నికైన అభ్యర్థులు, పార్టీ, రిజర్వేషన్లు తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల 11వ తేదీ వరకు ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కొత్త పాలకమండలి మొదటి సమావేశ తేదీని ప్రకటిస్తూ విడిగా మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి..
కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!
Tags :