
తాజా వార్తలు
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండో సారి కరోనా
అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటతో విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బచ్చుల అర్జనుడికి చికిత్స అందిస్తున్నారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు