
తాజా వార్తలు
పోలీసుల అదుపులో ముస్లిం సంఘాల నేతలు
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం తెదేపా, కాంగ్రెస్, బీఎస్పీ, ముస్లింలీగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడ, గుంటూరు, కడప, విశాఖఫట్నంకు చెందిన ముస్లిం సంఘాలు మద్దతు తెలిపాయి.
ఈ నేపథ్యంలో రాత్రి నుంచే పోలీసులు ఎక్కడికక్కడ ముస్లిం సంఘం నాయకులు, తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. విజయవాడలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు మరికొందరు నేతలకు ముందస్తు నోటిసులిచ్చి గృహనిర్బంధం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన పలువురు ముస్లిం సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు