
తాజా వార్తలు
పానీపూరీ వివాదం.. భయానక వాతావరణం
ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులను ఆహ్వానించే క్రమంలో తలెత్తిన గొడవ లాఠీలు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ భాగ్పట్లో జరిగింది. ఈ వివాదం తొలుత ఇద్దరు పానీపూరీ వ్యాపారుల మధ్య తలెత్తిందని పోలీసులు తెలిపారు. తమ షాపుకు రమ్మంటే తమ షాపుకు రమ్మని పోటీపడి వినియోగదారులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదరడంతో ఇరువురికి మద్దతుగా వచ్చిన వారు పరస్పరం కర్రలు, లాఠీలతో దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :