
తాజా వార్తలు
దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: ఉత్తమ్
హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దుబ్బాక నుంచి పోటీ చేయాలని పీసీసీ నిర్ణయించిందన్నారు. పోటీ విషయంలో ఎవరూ అనుమానపడాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. దుబ్బాక తెరాస ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ గూటికి భవానీ రెడ్డి
సిద్దిపేటకు చెందిన తెజస నాయకురాలు భవానీ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆమెతో పాటు మరో పది మంది అనుచరులు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు.
Tags :