DC vs PBKS: దిల్లీపై పంజాబ్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

దిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (103; 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం బాదడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది.

Updated : 13 May 2023 23:25 IST