MI vs GT: గుజరాత్‌పై ముంబయి విజయం.. సూర్యకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) గుజరాత్‌ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్‌ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ముంబయి 218/5 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో రషీద్ ఖాన్ (79: 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. గుజరాత్ 191/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబయి మూడో స్థానానికి చేరుకుంది. అంతకుముందు సూర్య కుమార్‌ (103*: 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం సాధించాడు. 

Updated : 12 May 2023 23:57 IST