IND vs ENG: పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం.. ఫైనల్‌లో పాక్‌తో ఢీ

రెండో సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 168/6 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ను కోల్పోకుండా 16 ఓవర్లలోనే 170 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు జోస్ బట్లర్ (80*), అలెక్స్ హేల్స్ (86*) భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఛేదించేశారు. దీంతో నవంబర్ 13న మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్‌ తలపడనుంది.

Updated : 10 Nov 2022 16:56 IST