IND vs NZ: భారత్‌ ఉత్కంఠ విజయం.. ఈ రోజు కొత్త ‘స్కై’ని చూశారు: సూర్యకుమార్‌

ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 99/8 స్కోరు చేయగా.. అనంతరం టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. చివరల్లో సూర్యకుమార్ యాదవ్ (26*) కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ రేసులోకి వచ్చింది. కివీస్‌తో కలిసి 1-1తో సమంగా నిలిచింది.

Updated : 30 Jan 2023 00:07 IST