ZIM vs IND : భారత్ సూపర్ విక్టరీ.. మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం
భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Updated : 18 Aug 2022 19:35 IST
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ విజయంతో ప్రారంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ వికెట్ నష్టపోకుండా 190 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81*), శుభ్మన్ గిల్ (82*) హాఫ్ సెంచరీలతో జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చారు.
ఓవర్ బై ఓవర్ అప్డేట్స్...
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ