
తాజా వార్తలు
అమరావతి: రాజధానిలోని స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజధాని ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని ప్రకటనలో ఆయన వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
