
తాజా వార్తలు
విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడేందుకు ఇంగితజ్ఞానం లేదా?
అమరావతి: తనను ‘పవన్నాయుడు’ అని వైకాపా స్పందించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించడం మానుకోవాలని హెచ్చరించారు. ‘ ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదు. కానీ, ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లో ఉంటుంది’ అని పవన్ వ్యాఖ్యానించారు.
తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూర్వకంగానే అన్నానని, ఈ వ్యాఖ్యలకు మంత్రి బొత్స బాధపడిపోతున్నారని పవన్ విమర్శించారు. ‘ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి’ అంటూ వైకాపా నేతలపై ఘాటుగా విమర్శించారు. ‘ విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి ఇంగితజ్ఞానం లేదా?అంటూమండిపడ్డారు. ‘ మట్టిలో కలిసిపోతారు అనే మాటను నేను ఆవేశంలో అనలేదు. తెలుగుభాషను మీరు అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నా. మా పార్టీది భాషల్ని గౌరవించే సంప్రదాయం’ అని పవన్ అన్నారు.