
తాజా వార్తలు
పరిశ్రమల్ని తరలించాలని చూస్తే ఊరుకోం: ఠాక్రే
ముంబయి: మహారాష్ట్ర నుంచి ఎవరైనా పరిశ్రమల్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే అనుమతించేది లేదని సీఎం ఉద్ధవ్ఠాక్రే తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ముంబయి పర్యటనలో భాగంగా పలువురు వాణిజ్యవేత్తలు, సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘ఒకరు అభివృద్ధి చెందుతుంటే మహారాష్ట్రవాసులు ఎప్పుడు అసూయగా భావించరు. అదేవిధంగా ఏదైనా రంగంలో పోటీ ఇచ్చినా మాకు ఏం సమస్య లేదు. కానీ బలవంతంగా మా నుంచి ఏదైనా తీసుకెళ్లిపోతామంటే మాత్రం ఉపేక్షించేది లేదు. అటువంటి చర్యలను ఏమాత్రం సాగనివ్వను. మీరు(వాణిజ్యవేత్తలు) కూడా అలా వెళ్లరు. పెట్టుబడిదారులకు మహారాష్ట్ర స్వర్గధామంగా ఉంటుంది’ అని ఠాక్రే పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ ఇటీవల మాట్లాడుతూ.. హిందీ చిత్రపరిశ్రమ ‘బాలీవుడ్’ను ముంబయి నుంచి తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేసిన క్రమంలో ఠాక్రే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
