
తాజా వార్తలు
రైతు నిరసన.. దేశ భద్రతా సమస్య
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు పంజాబ్ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే ప్రభావం చూపవని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని కేంద్రం, రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
‘కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు. నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, దేశ భద్రతను ప్రభావితం చేసే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాను’ అని అమరీందర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. దిల్లీలో ఆయన అమిత్ షాను రైతుల సమస్యలపై చర్చించారు. రెండో విడత రైతులతో కేంద్రం చర్చలకు సిద్ధమవుతోన్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, చలి తీవ్రతను లెక్క చేయకుండా ఎనిమిది రోజులుగా దిల్లీ శివారుల్లో రైతులు రహదారులపైనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సింఘు, టిక్రి వద్ద వేలాది మంది శాంతియుతంగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి చర్చలు జరుగుతుండటంతో.. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
