
తాజా వార్తలు
ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతి
పశ్చిమ చంపరన్: బిహార్లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఆపరేషన్లో బిహార్ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ), స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) బలగాలు పాల్గొన్నాయి. సంఘటనా స్థలంలో మూడు అత్యాధునిక తుపాకులు, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.
Tags :