
ప్రధానాంశాలు
మేనకా గంభీర్ను ప్రశ్నించిన సీబీఐ
బెంగాల్ రాజకీయాల్లో కాక
కోల్కతా: బెంగాల్ రాజకీయాల్లో కాక కొనసాగుతోంది. బొగ్గు చౌర్యం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మరదలు మేనకా గంభీర్ను సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమెతో పాటు అభిషేక్ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కోల్కతాలోని మేనక నివాసానికి అధికారుల బృందం సోమవారం వెళ్లింది. ఇద్దరు మహిళా అధికారులు దాదాపు మూడు గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.
సమన్లపై స్పందించిన రుజిరా బెనర్జీ
బొగ్గు చౌర్యం కేసులో సీబీఐ తనకు జారీ చేసిన సమన్లపై రుజిరా బెనర్జీ సోమవారం స్పందించారు. తనను ప్రశ్నించేందుకు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తన నివాసానికి రావాలంటూ అధికారులకు లేఖ రాశారు. తనను ఎందుకు ప్రశ్నించనున్నారనే విషయం మాత్రం తనకు తెలియదని అందులో పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
