
తాజా వార్తలు
దుబాయ్: ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో టోర్నీలో ఐదుగురు ప్రత్యేక బ్యాట్స్మెన్ పేర్లను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ మేరకు ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో ‘‘ఈ ఐదుగురు బ్యాట్స్మెన్ ప్రపంచకప్ టోర్నీలో అత్యంత ప్రత్యేకం’’ శీర్షికతో ఓ వీడియోను ఉంచింది. ఇందులో రోహిత్ శర్మతో పాటు మరో నలుగురి పేర్లను పొందుపర్చింది. ఈ జాబితాలో రోహిత్ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్, కేన్ విలియమ్సన్, జో రూట్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.
రోహిత్ శర్మ 81 సగటుతో 648 పరుగులు చేసి ప్రపంచకప్ 2019 టోర్నీ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడిన భారత్ పోరాడి ఓడడంతో రోహిత్ శ్రమ ఒకరకంగా వృథా అయిందనే చెప్పాలి. అలాగే ప్రపంచకప్ సంగ్రామం ముగియడంతో టోర్నీ ఉత్తమ జట్టును సోమవారం ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలోనూ రోహిత్కు చోటు దక్కడం విశేషం. భారత్ నుంచి యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రాకు సైతం స్థానం కల్పించారు.
6️⃣4️⃣8️⃣ 🏏 @ImRo45
— Cricket World Cup (@cricketworldcup) July 16, 2019
6️⃣4️⃣7️⃣ 🏏 @davidwarner31
6️⃣0️⃣6️⃣ 🏏 @Sah75official
5️⃣7️⃣8️⃣ 🏏 Kane Williamson
5️⃣5️⃣6️⃣ 🏏 @root66
These five batsmen were pretty special at #CWC19 pic.twitter.com/vSt5A95sfg
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
