
తాజా వార్తలు
బెంగళూరు: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే దసరా ఉత్సవాలకు ప్రఖ్యాతి గాంచిన మైసూరులో ‘దసరా యువ క్రీడల’ ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పతో కలసి పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కర్ణాటక దసరా ఉత్సవాలతో పాటు, దసరా యువ క్రీడలను ప్రారంభించాల్సిందిగా సింధును ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప కొద్ది రోజుల కిందట ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు మైసూరు చేరుకున్న పీవీ సింధు సీఎం యడియూరప్పతో కలసి దసరా యువ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత సింధును యడియూరప్ప సన్మానించారు. గత ఆగస్టులో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. జపాన్కు చెందిన నోజోమి ఒకుహరను 21-7, 21-7 తేడాతో ఓడించింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
