
తాజా వార్తలు
హంసలదీవి(కోడూరు), న్యూస్టుడే: సముద్రంలో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను మాజీ సర్పంచి కొక్కిలిగడ్డ సముద్రాలు కాపాడిన సంఘటన హంసలదీవి వద్ద సాగరతీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కార్తిక మాసం కావడంతో రోజూ సాగరసంగమ తీరానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. గురువారం కూడా అధిక సంఖ్యలో వచ్చారు. విజయవాడ నుంచి వచ్చిన ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు స్నానాలు చేస్తూ... పోలీసులు తెలిపిన నిర్దేశిత ప్రదేశాన్ని దాటి సముద్రంలోకి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో సమయానికి అక్కడే ఉన్న హంసలదీవి మాజీ సర్పంచి, మత్స్యకారుడైన కొక్కిలిగడ్డ సముద్రాలు వెంటనే సముద్రంలోకి దూకి వారిని రక్షించాడు. దీంతో వియజవాడకు చెందిన విజయదుర్గ, గౌరి, లక్ష్మి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఊపిరాగిపోతుందనుకునే సమయానికి వచ్చి ‘ఆపద్భాందవుడిలా..’ కాపాడావయ్యా..! అంటూ వారు, వారి కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు మెరైన్ పోలీసు సిబ్బంది నరసయ్య, కోడూరు పోలీసులు, పాలకాయతిప్ప ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుతున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్బీర్కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
