
తాజా వార్తలు
ప్రతి సినిమాకు రూ.లక్ష పెంచా..
హైదరాబాద్: ‘ఓ బేబీ’ సినిమా తనకు రచయితగా సంతృప్తిని ఇచ్చిందని రచయిత లక్ష్మీ భూపాల్ అన్నారు. అగ్ర కథానాయిక సమంత నటించిన సినిమా ఇది. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మి, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లో కనిపించారు. నాగచైతన్య అతిథి పాత్రలో సందడి చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. ఆయన డైలాగ్స్కు చక్కటి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా లక్ష్మీ భూపాల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలివి..
* ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు అవుతోంది. దాదాపు 60 సినిమాలకు రాశాను. అందులో 15 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ‘చందమామా’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘కళ్యాణ వైభోగమే’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. నాకు ఇన్ని సినిమాలతో రాని సంతృప్తి .. ‘ఓ బేబీ’తో లభించింది. నిజానికి నేను పెద్ద హీరోల సినిమాలకు రాయలేదు. దీంతో అసంతృప్తి కాస్త ఉంది. బహుశా నాకు పంచ్లు, ప్రాసలు రావని తీసుకోవడంలేదేమో. కానీ దాదాపు నాకు అందరు హీరోలు, దర్శకులతో పరిచయాలు ఉన్నాయి. ‘దేవదాసు’ సినిమాను కూడా మొదలు పెట్టి, మధ్యలో వచ్చేశా. నా తరఫున ఏమీ సమస్య లేదు.. నన్ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు అనుకోవాలి’.
* ‘నా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. మా అమ్మ, అమ్మమ్మ.. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు. అదంతా ఇందులో చూశా. నేను ఈ విజయాన్ని వాళ్లకే అంకితమిస్తా. ఈ సినిమా పుట్టింది కొరియాలో.. కానీ మనం పెంచుకున్నాం. మాటలు రాసుకున్నాం’.
* ‘ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి రూ.లక్ష పారితోషికం పెంచేవాడ్ని. సినిమా ఫెయిల్ అయినా.. నేనెప్పుడూ రచయితగా ఫెయిల్ కాలేదు. నిజానికి నా రెండో సినిమా ఫెయిల్ అయ్యింది. కానీ ప్రతిభ ఉంది కాబట్టే తర్వాత 60 సినిమాల్లో అవకాశం వచ్చింది. దాదాపు చాలా మంది రచయితలు కోపంతో దర్శకులు అవుతున్నారు. ‘మనం రాసింది వాళ్లు తీయడం లేదు, మనకు నచ్చినట్లు ఉంచడం లేదు’ అనే బాధతో అందరు రచయితల్లా దర్శకత్వం వైపుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు’.
* ‘చిత్ర పరిశ్రమలో నేర్చుకోవడానికి ఏం ఉండదు. డబ్బులు సంపాదించుకుని, వెళ్లిపోవడమే.. కాకపోతే పని నేర్చుకుంటాం అంతే. నేను ఆఫీసుల చుట్టు తిరిగి రచయితను కాలేదు. అనుకోకుండా అయ్యా. ‘సోగ్గాడే’ సినిమాకు వేరే వాళ్లు సగం మాటలు రాశారు. అనుకోకుండా దాన్ని నేను పూర్తి చేయాల్సి వచ్చింది. అలా రచయిత అయ్యా’.
* ‘నా వద్ద దాదాపు 24 కథలు ఉన్నాయి. ఆరు నా కోసం పెట్టుకున్నా. మిగిలినవి అవసరమైన దర్శకులకు ఇస్తాను. డబ్బుల కోసం చిత్ర పరిశ్రమకు వచ్చాను. అదే పని చేస్తున్నా. దీనికంటే ఎక్కువ మొత్తం బయట వస్తాయంటే మొహమాటం లేకుండా వెళ్లిపోతా. నేను కథలు రాయడానికి విదేశాలకు వెళ్లను. నాకు పాస్పోర్ట్ కూడా లేదు. మా ఇంట్లో కూర్చునే రాస్తా’.
* ‘‘ఓ బేబీ’ తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన వారు చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసించారు. తర్వాత దాదాపు 7 సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ అన్నీ చిన్న చిత్రాలే. వాటిలో కొన్ని సినిమాల కథలు కూడా నాకు నచ్చలేదు. ప్రస్తుతం నందిని రెడ్డి, తేజ దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాలకు రాస్తున్నా’.
* ‘సమంతకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. నేను ఎన్నో సినిమాలకు పనిచేశా. కానీ ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ ఎప్పుడూ రాలేదు. ప్రతి ప్రెస్మీట్లో సమంత, నందిని నా పేరు ప్రస్తావించారు. చాలా మంది ఫోన్ చేసి కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాం అంటున్నారు. మా అమ్మ ఈ సినిమా చూశారు. తల్లి-కొడుకు మధ్య సీన్లు వచ్చిన ప్రతిసారి అమ్మ నావైపు చూస్తూ ఉన్నారు’.
* ‘నేను చిరంజీవికి అభిమానిని. ఆయనలోని పాలకొల్లు కొంటెకుర్రాడు బయటికి వస్తే చూడాలని ఉంది. ఆ కొంటెతనం ఆయనలో అలానే ఉంది. కానీ వయసు దృష్యా ఆయన కోసం అలాంటి డైలాగ్లు, కథలు రాయడం లేదు’.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్బీర్కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
