
తాజా వార్తలు
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ కథానాయిక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వారి అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. అటు విరాట్ వరుస టూర్లతో, ఇటు అనుష్క సినిమాలో తీరికలేకుండా గడుపుతుంటారు. బిజీ షెడ్యూల్లో ఏ కొంచెం విరామం దొరికినా ఇరువురు తమ సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. భర్త విరాట్ కోహ్లీ దుస్తులను దొంగిలించి వేసుకుంటానని చెప్పుకొచ్చింది.
‘‘విరాట్ వార్డ్ రోబ్లో బోలెడన్ని దుస్తులు ఉంటాయి. వాటిలో నాకు నచ్చినవి తీసేసుకుంటా. ఎక్కువగా విరాట్ టీ-షర్టులను వాడేస్తా. కొన్నిసార్లు జాకెట్స్ కూడా వేసుకుంటాం. ఎందుకంటే అలా మావారి దుస్తులు నేను ధరించినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది’’-అనుష్క శర్మ
ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి సందర్భంగా ధరించిన గులాబీ రంగు దుస్తులను కావాలని ఎంపిక చేసినవి కాదని తెలిపింది. ట్రెండ్ను తాను ఫాలోనని చెప్పింది. రెండేళ్ల కిందట విరాట్తో తన పెళ్లి సందర్భంగా అనుష్క ధరించిన లెహంగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరుష్క జోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. విరాట్ నవంబరు 5న తన పుట్టినరోజు వేడుకలను అనుష్కతో కలిసి జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా దిగిన వారు ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
