
తాజా వార్తలు
భరోసా ఇచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
ముంబయి: జమ్మూకశ్మీర్ క్రికెట్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ హామీ ఇచ్చారు. ఆ సంఘం సీనియర్ అధికారితో పాటు కెప్టెన్ పర్వేజ్ రసూల్, మెంటార్ ఇర్ఫాన్ ఫఠాన్ సోమవారం ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో గంగూలీని కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్లో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానూకూలంగా స్పందించిన దాదా అక్కడి అభివృద్ధికి పూర్తి భరోసానిచ్చారు.
‘మావాళ్లు చెప్పినవన్నీ గంగూలీ విన్నారు. స్థానిక క్రికెట్ అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే జమ్మూకశ్మీర్లో క్రికెట్ నిర్వహణకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరాము. మరోసారి జమ్మూలో స్థానిక మ్యాచ్లు ఆడాలని భావిస్తున్నాము. మాకు అక్కడ ఓ కళాశాల మైదానం ఉంది. దాన్ని అభివృద్ధి చేసి, సరైన సదుపాయాలు కల్పిస్తాం. తద్వారా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది’ అని భేటీ అనంతరం ఆ సంఘం అధికారి పేర్కొన్నాడు.
ఇటీవల జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో తలెత్తిన సంక్షోభంపై స్పందించిన ఆ అధికారి.. మరో నెలన్నర రోజుల్లో అంతా సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గంగూలీకి స్పష్టం చేశామని తెలిపాడు. కాగా, జమ్మూకశ్మీర్ సీనియర్ జట్టు ప్రస్తుతం సూరత్లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడుతోంది. కెప్టెన్ పర్వేజ్ రసూల్ అందుబాటులో లేకపోవడంతో శుభంపందిర్ ఆ జట్టును నడిపిస్తున్నాడు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్బీర్కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
