
తాజా వార్తలు
క్షమించండి
ముంబయి: ఈ ఏడాది కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి (·కేఐఎఫ్ఎఫ్) హాజరు కాలేకపోయానని షెహెన్షా అమితాబ్ బచ్చన్ అన్నారు. అనారోగ్య కారణంగా వేడుకలకు హాజరు కాలేకపోయానని ఆయన స్పష్టం చేశారు. నవంబరు 8న ప్రారంభమైన 25వ కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 15న ముగిసింది. ఈ వేడుక ముగింపు కార్యక్రమంలో అమితాబ్ వీడియోను ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో బిగ్బి క్షమించమని కోరారు. ‘నాకు ఎంతో ఇష్టమైన నగరం కోల్కతాలో జరగనున్న చిత్రోత్సవానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నన్ను ఆహ్వానించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వేడుకకు రాలేకపోయాను. అయినా సరే నేను చెప్పాలనుకున్న స్పీచ్ సిద్ధం చేసుకున్నా. ఇది మీరు చూసి నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నా. మరోసారి కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మమతా జీ. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకొంటున్నందుకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
అనంతరం చిత్ర పరిశ్రమ గురించి అమితాబ్ మాట్లాడుతూ.. ‘ఇవాళ భారత చిత్ర పరిశ్రమ కోసం మనమంతా కష్టపడుతున్నాం. కంటెంట్ను ఇంటి నుంచే చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కానీ సినిమాను వెండితెరపై చూడటంలో వచ్చే థ్రిల్ వేరు. దానికి ఏవీ సాటిరావు. ఈ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. సినిమాల్ని ముందు థియేటర్లో విడుదల చేయాలి. ఆపై మిగిలిన మాధ్యమాల్లో ప్రసారం కావాలి. నేటి తరం అభిరుచులు మారాయి. దానికి తగ్గట్టే మా సినిమాలు కూడా వస్తాయి’ అని చెప్పారు. కోల్కతా చలన చిత్ర ఆరంభోత్సవానికి షారుక్ ఖాన్, సౌరభ్ గంగూలీ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రతి ఏడాది చిత్రోత్సవానికి విచ్చేసే అమితాబ్ ఈసారి హాజరుకావడం లేదని తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్పై ఆడతా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
