
తాజా వార్తలు
యువీ తండ్రి, మాజీ పేసర్ యోగ్రాజ్ సింగ్
దిల్లీ: ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక నాకౌట్లో టీమిండియా ఓటమికి వికెట్కీపర్, బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోనీయే కారణమని ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, భారత జట్టు మాజీ పేసర్ యోగ్రాజ్సింగ్ ఆరోపించారు. లీగ్ దశలో ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరుకున్న జట్టు సెమీఫైనల్స్లో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ విషయంపై ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన యోగ్రాజ్ ధోనీ ఆటతీరును విమర్శించాడు. డెత్ఓవర్లలో అతడు నెమ్మదిగా ఆడి రవీంద్రజడేజాపై ఒత్తిడి తేవడమేంటని ప్రశ్నించారు.
‘రవీంద్రజడేజా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి ఏమాత్రం భయం లేకుండా భారీ షాట్లు ఆడుతుండగా మరోవైపు నువ్వు నెమ్మదిగా బ్యాటింగ్ చేశావు. అతడు 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా ఆడమని చెప్పావు. అతడికన్నాముందు హార్దిక్ పాండ్యని స్పిన్నర్లపై ఎదురుదాడి చేయమని చెప్పావు’ అని యోగ్రాజ్ పేర్కొన్నారు.
‘మిస్టర్ ధోనీ నువ్వు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడావు. ఎలా ఆడాలో ఎలా ఆడకూడదో ఆమాత్రం తెలియదా?నీలాగే యువరాజ్ ఎప్పుడైనా వేరే ఆటగాళ్లకి అలా, ఇలా ఆడమని చెప్పాడా?నీకు మంచి బంతులు పడ్డప్పుడు నువ్వెందుకు సిక్సులు కొట్టలేకపోయావు?అప్పుడు నీకు ఆందోళన లేదా? నువ్వు ముందే ఔటైనా ఫలితంలో పెద్ద తేడా ఉండేది కాదు’ అని ఘాటుగా స్పందించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్నాథ్సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- రూ.200 పెట్టి ఫస్ట్షో చూడండి!
- పాస్పోర్ట్పై కమలం చిహ్నం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
