
తాజా వార్తలు
1. ఏపీలో త్వరలో ‘రచ్చబండ’:జగన్
సామాన్యులపై భారం మోపకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని, ఇందుకు దిల్లీలోని అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టామని చెప్పారు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చెన్నమనేని రమేశ్కు హైకోర్టులో ఊరట
తెరాసకు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేంద్రం ప్రభుత్వ ఉత్తర్వులను 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సీఎం పదవి మీరే చేపట్టండి: పవార్
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్ ఠాక్రే చేపట్టాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని చెప్తానని ఉద్ధవ్ సమాధానం ఇచ్చినట్లు సేన నాయకులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఠాక్రే, పవార్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వంలో ఆదిత్య ఠాక్రే పాత్ర ఏంటనే అంశమూ ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రభుత్వం ఏర్పాటు చేసినా 6-8 నెలలే: గడ్కరీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టడాన్ని అవకాశవాద కూటమిగా కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత గడ్కరీ అభివర్ణించారు. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆరు నెలలు లేదా మహా అయితే 8 నెలలకు మించి ఉండబోదని జోస్యం చెప్పారు. ఝార్ఖండ్ ఎన్నికల సన్నాహాకాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పీటీఐ వార్తా సంస్థకు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఎలక్టోరల్ బాండ్లపై కాంగ్రెస్ నిరసన
ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వాటిని తోసిపుచ్చిందని వార్తలు రావడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చకు తెరలేపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తేదీమార్పు
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత అనుకున్నరోజు కంటే ఒక్కరోజు ముందుగా.. అనగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుగు చిత్ర నిర్మాతల సంఘం తెలిపింది. సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి అడ్డంకులు..?
ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘బుల్లెట్ రైలు’ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్టుని పక్కనబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పక్షాలు కలిసి సిద్ధం చేసిన కనీస ఉమ్మడి ప్రణాళికలో దీన్ని చేర్చలేదని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మొత్తాన్ని రైతుల సంక్షేమానికి కేటాయించాలని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇటీవల సాగిన చర్చల్లో నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి తోడు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. అయితే, లోహ, ఇంధన షేర్లు రాణించడంతో నిఫ్టీ 11,900 పైన స్థిరపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 11,914 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.78గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్సై
నగరంలోని బాలాపూర్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యకు యత్నించారు. సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాలాపూర్ నుంచి మంచాల పీఎస్కు నరసింహను బదిలీ చేశారు. ఈ బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పింక్ టెస్టును ప్రారంభించిన మమతా బెనర్జీ, షేక్ హసీనా
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
