
తాజా వార్తలు
ది హేగ్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నేడు విచారణ ప్రారంభించింది. భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తొలుత వాదనలు వినిపిస్తున్నారు.
‘ఓ అమాయక భారతీయుడిని రక్షించేందుకు వాదనలు వినిపించే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నా. కుల్భూషణ్ జాదవ్ కేసుపై పాకిస్థాన్ చేపట్టిన విచారణలో పలు లోపాలున్నాయి. జాదవ్ అక్రమంగా దేశంలోకి చొరబడటంతో అరెస్టు చేసినట్లు పాక్ చెబుతోంది. కానీ జాదవ్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని చెప్పేందుకు భారత్ వద్ద సాక్ష్యాలున్నాయి. జాదవ్ విచారణకు సంబంధించిన ఎటువంటి పత్రాలను భారత్కు ఇవ్వలేదు. అంతేగాక.. జాదవ్ను కలిసేందుకు భారత్కు దౌత్యపరమైన అనుమతి కూడా ఇవ్వలేదు. ఇలా కాన్సులర్ యాక్సెస్ లేకుండా ఆయనను కస్టడీలో కొనసాగించడం చట్టవిరుద్ధం. ఇదొక్కటే కాదు .. జాదవ్కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్ ఎలాంటి ఆధారాలను చూపించలేదు’ అని హరీశ్ సాల్వే వాదించారు.
తొలిసారిగా 2016 మార్చిలో భారత్ కాన్సులర్ యాక్సెస్ కోరగా.. పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సాల్వే న్యాయస్థానానికి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 13 సార్లు అభ్యర్థించగా ఒక్క దానికి కూడా పాక్ సమాధానం ఇవ్వలేదన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఓ ప్రచార సాధనంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సాల్వే అన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా జాదవ్ను కలిసేందుకు పాక్ వెంటనే దౌత్యపరమైన అనుమతి ఇవ్వాలన్నారు.
గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్ను ఇరాన్ నుంచి జాదవ్ను పాక్ ఏజంట్లు కిడ్నాప్ చేశారు. అనంతరం బలూచిస్థాన్లో ప్రవేశించినట్టు ప్రకటించారు. 2017 ఏప్రిల్లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017 మే 18న జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. ఈ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానం నేటి నుంచి నాలుగు రోజుల పాటు వాదనలు విననుంది. రేపు పాక్ తమ వాదనలు వినిపిస్తుంది. తిరిగి 20న మనదేశం స్పందించాక, 21న పొరుగుదేశం తుది వాదనలు వినిపిస్తుంది. జాదవ్ కేసుపై ఈ ఏడాది వేసవిలోగా తుది తీర్పు వెలువడుతుందని అంచనా. పుల్వామా ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రధాన్యం సంతరించుకొంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
