
26/11 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయం ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. 26/11 ముంబయి దాడులకు కారణమైన వారిని శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవాస భారతీయులు గురువారం బ్యానర్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టగా.. ఇతర దేశాలకు చెందినవారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొన్నారు. న్యూయార్క్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయం నుంచి టైమ్స్స్క్వేర్కు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు భారత్, అమెరికా జెండాలను పట్టుకొని ప్రదర్శనగా ముందుకు సాగారు. ‘పాక్.. ఉగ్రవాదం మానుకో’, ‘ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలవండి’ ‘ఉగ్రవాదం వద్దని చెప్పండి’, ‘మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ నినదించారు. ముంబయిలో ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు దాటినా.. అందుకు బాధ్యులను పాకిస్థాన్ ప్రభుత్వం శిక్షించలేదని మండిపడ్డారు. ఈ ఆందోళన సందర్భంగా పాక్ దౌత్య కార్యాలయం బయట డిజిటల్ వ్యాన్లను ఏర్పాటు చేసి నాటి ఉగ్రదాడి దృశ్యాలను ప్రదర్శించారు. అలాగే, అమెరికాలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి ప్రదర్శన నిర్వహించారు.
వార్తలు / కథనాలు
దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి