
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. క్యాపిటల్ ఉదంతంతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యాన్ని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో 4,300 మందికి పైగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3,80,000లకు చేరింది. మరోవైపు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22.8 మిలియన్లకి చేరుకుంది. అరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం దారుణంగా కనిపిస్తోంది. రెండున్నర నెలల నుంచి అక్కడ కొవిడ్ మరణాల సంఖ్య మరింతగా పెరుగుతోంది.
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నప్పటికీ రోజుకు సగటున 2.5లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటివరకు 9.3లక్షల మంది అమెరికన్లు వ్యాక్సిన్ తొలి డోసును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రక్రియను విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియాలు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని అనేకచోట్ల ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్ హోంలలో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇదీ చదవండి..
వార్తలు / కథనాలు
దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్హౌస్ను వీడిన ట్రంప్ దంపతులు
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి