Droupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్‌ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి సైనిక హెలికాప్టర్‌లో  నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి, త్రివిధ దళాల అధికారులు స్వాగతం పలికారు.

Updated : 26 Dec 2022 20:56 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని