News In Pics: చిత్రం చెప్పే సంగతులు -02(22-01-2023)

Updated : 22 Jan 2023 22:10 IST
1/31
హైదరాబాద్‌లోని గాజులరామారంలో చిత్తారమ్మతల్లి జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఇలా కనిపించాయి. హైదరాబాద్‌లోని గాజులరామారంలో చిత్తారమ్మతల్లి జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఇలా కనిపించాయి.
2/31
3/31
హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ వాలీబాల్‌ జట్టు సహయజమానిగా, అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులు, ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ వాలీబాల్‌ జట్టు సహయజమానిగా, అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులు, ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.
4/31
మాదాపూర్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నూతన డిజైనర్‌ దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నూతన డిజైనర్‌ దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
5/31
6/31
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలోని మంగళం మార్గంలో ‘యువగళం’ ఆకారంలో దీపాలు వెలిగించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలోని మంగళం మార్గంలో ‘యువగళం’ ఆకారంలో దీపాలు వెలిగించారు.
7/31
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
8/31
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి  సినీనటి హనీరోజ్‌ విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి హనీరోజ్‌ విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
9/31
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు తదితరులు నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు తదితరులు నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
10/31
పూజల్లో పాల్గొన్న బండి సంజయ్‌ పూజల్లో పాల్గొన్న బండి సంజయ్‌
11/31
హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో భరతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో భరతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు.
12/31
భరతమాత వేషధారణలో చిన్నారి భరతమాత వేషధారణలో చిన్నారి
13/31
హైదరాబాద్‌ సైకిల్‌ రైడ్‌ క్లబ్‌ సభ్యులు ఆదివారం ఉదయం చార్మినార్‌ నుంచి ‘హిస్టారికల్‌ రైడ్‌’ పేరుతో సైకిల్ రైడ్‌ ప్రారంభించారు. వరంగల్‌ వరకు ఈ రైడ్‌ ఉంటుందని.. ఆరోగ్యం, చరిత్రపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. హైదరాబాద్‌ సైకిల్‌ రైడ్‌ క్లబ్‌ సభ్యులు ఆదివారం ఉదయం చార్మినార్‌ నుంచి ‘హిస్టారికల్‌ రైడ్‌’ పేరుతో సైకిల్ రైడ్‌ ప్రారంభించారు. వరంగల్‌ వరకు ఈ రైడ్‌ ఉంటుందని.. ఆరోగ్యం, చరిత్రపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.
14/31
హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ హోటల్‌ను సినీనటుడు నితిన్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ హోటల్‌ను సినీనటుడు నితిన్‌ ప్రారంభించారు.
15/31
ప్రపంచ విప్లవ యోధుడు కామ్రేడ్‌ చేగువేరా కుమార్తె అలైదా గువేరా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్‌ను సందర్శించారు. ప్రపంచ విప్లవ యోధుడు కామ్రేడ్‌ చేగువేరా కుమార్తె అలైదా గువేరా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్‌ను సందర్శించారు.
16/31
ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రారంభోత్సవంలో సినీ నటీమణులు అనుపమ పరమేశ్వరన్‌, శ్రీలీల పాల్గొని సందడి చేశారు. ఎల్బీనగర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రారంభోత్సవంలో సినీ నటీమణులు అనుపమ పరమేశ్వరన్‌, శ్రీలీల పాల్గొని సందడి చేశారు.
17/31
శ్రీలీల శ్రీలీల
18/31
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ‘క్యూటికాన్ 2022’ సదస్సును మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. రేపటి వరకు కొనసాగనున్న ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన చర్మవైద్య నిపుణులు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ‘క్యూటికాన్ 2022’ సదస్సును మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. రేపటి వరకు కొనసాగనున్న ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన చర్మవైద్య నిపుణులు పాల్గొంటున్నారు.
19/31
సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. సోమవారం ఉదయం 9.30గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి 3న ‘మైఖేల్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. సోమవారం ఉదయం 9.30గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి 3న ‘మైఖేల్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
20/31
హైదరాబాద్‌ గాజులరామారంలోని చిత్తారమ్మతల్లి జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్‌ గాజులరామారంలోని చిత్తారమ్మతల్లి జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
21/31
చిత్తారమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి చిత్తారమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి
22/31
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
23/31
లూనార్‌ న్యూ ఇయర్‌-2023 వేడుకల్లో భాగంగా ఉత్తరకొరియా ప్రజలు ఆ దేశ దివంగత నాయకుల విగ్రహాలకు నివాళి అర్పించారు. ప్యాంగ్‌యాంగ్‌ మున్సుహిల్‌లో ఒకే దగ్గర ఉన్న కిమ్‌ ఇల్‌ సంగ్‌2, కిమ్‌ జోంగ్‌ ఇల్‌2 విగ్రహాలను వారు దర్శించుకున్నారు. లూనార్‌ న్యూ ఇయర్‌-2023 వేడుకల్లో భాగంగా ఉత్తరకొరియా ప్రజలు ఆ దేశ దివంగత నాయకుల విగ్రహాలకు నివాళి అర్పించారు. ప్యాంగ్‌యాంగ్‌ మున్సుహిల్‌లో ఒకే దగ్గర ఉన్న కిమ్‌ ఇల్‌ సంగ్‌2, కిమ్‌ జోంగ్‌ ఇల్‌2 విగ్రహాలను వారు దర్శించుకున్నారు.
24/31
ఈజిప్టు ఉటాలోని పార్క్ సిటీలో ‘సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్‌ థియేటర్‌ డివినిటీలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ షోకు నటి బెల్లా థోర్న్ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు. ఈజిప్టు ఉటాలోని పార్క్ సిటీలో ‘సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్‌ థియేటర్‌ డివినిటీలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ షోకు నటి బెల్లా థోర్న్ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.
25/31
నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాతి సమ్మేళనం-2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, దర్శకుడు రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాతి సమ్మేళనం-2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, దర్శకుడు రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
26/31
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఇలా క్యూ లైన్‌లో నిలుచున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఇలా క్యూ లైన్‌లో నిలుచున్నారు.
27/31
సెల్‌ఫోన్‌ కౌంటర్‌ వద్ద అభ్యర్థులు సెల్‌ఫోన్‌ కౌంటర్‌ వద్ద అభ్యర్థులు
28/31
ఇండోనేసియా బాలిలోని ఎన్‌గురాహ్‌ రాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా మహిళలు తమ దేశ సంప్రదాయ దుస్తులు ధరించి ఇలా పర్యాటకులకు స్వాగతం పలకడం ఆకట్టుకుంది. ఇండోనేసియా బాలిలోని ఎన్‌గురాహ్‌ రాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా మహిళలు తమ దేశ సంప్రదాయ దుస్తులు ధరించి ఇలా పర్యాటకులకు స్వాగతం పలకడం ఆకట్టుకుంది.
29/31
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది.
30/31
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీలు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల కొత్త కోడళ్లు నైవేద్యం కోసం కోనూరు నుంచి నీరు తీసుకురావడం విశేషం. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీలు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల కొత్త కోడళ్లు నైవేద్యం కోసం కోనూరు నుంచి నీరు తీసుకురావడం విశేషం.
31/31
గంగాజలాన్ని తీసుకువస్తున్న ఆదివాసీలు గంగాజలాన్ని తీసుకువస్తున్న ఆదివాసీలు

మరిన్ని