News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(08-02-2023)
Updated : 08 Feb 2023 20:26 IST
1/20
భారత్, ఆస్ట్రేలియాల మధ్య గురువారం నుంచి బోర్డర్ గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాగ్పూర్లోని మైదానంలో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు..
2/20
3/20
కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘సార్’. సంయుక్త మేనన్ కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ధనుష్, సంయుక్త ఇలా మెరిశారు.
4/20
మాజీ క్రికెటర్లు యువరాజ్సింగ్, పార్థివ్ పటేల్, హర్భజన్ సింగ్ కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పార్థివ్ పటేల్ తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు. తమ పాతమిత్రుల మధ్య బంధం మరింత బలపడి సోదరభావంతో మెలుగుతున్నామని చెబుతూ ఆయన పోస్టు పెట్టారు.
5/20
కార్తికేయ, నేహాశెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బెదురులంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్ర టీజర్ను ఫిబ్రవరి 10న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
6/20
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.
7/20
గతంలో క్వీన్ ఎలిజిబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ముద్రించిన 15కిలోల బంగారు నాణేన్ని లండన్లో నిర్వహించిన ‘ట్రయల్ ఆఫ్ ది పిక్స్’ కార్యక్రమంలో ప్రదర్శించారు.
8/20
కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్’. సంయుక్త మేనన్ కథానాయిక. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6.30గంటలకు విడుదల కానుంది. అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదలను కొంత సమయం వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది..
9/20
హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడ గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కుతున్నట్లుగా తీర్చిదిద్దిన అలంకరణలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
10/20
ప్రారంభానికి సిద్ధమవుతున్న నీరా కేఫ్
11/20
చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిరంజీవి అదిరే స్టెప్పులతో ఓ పాట చిత్రీకరిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ట్విటర్లో పోస్టు పెట్టింది.
12/20
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్లాస్టిక్ సీసాలతో రీసైకిల్ చేసిన నీలం రంగు జాకెట్ ధరించి రాజ్యసభకు హాజరయ్యారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఇండియన్ ఎనర్జీ వీక్ 2023’కు ఇటీవల హాజరైన మోదీకి.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్ను బహూకరించింది.
13/20
గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో జీ20 ఆధ్వర్యంలో పర్యాటక సదస్సు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి సంప్రదాయ వస్ర్తధారణలో ఒంటెను పట్టుకుని కనిపించారు.
14/20
భారత్, ఆస్ట్రేలియాల మధ్య గురువారం నుంచి బోర్డర్ గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు.
15/20
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సినీనటి శ్రీలీల మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆమె కొనియాడారు. శాన్వీ శ్రీవాస్తవ, అనుపమ పరమేశ్వరన్లను గ్రీన్ఇండియా ఛాలెంజ్కు శ్రీలీల నామినేట్ చేశారు.
16/20
మొక్క నాటుతున్న శ్రీలీల
17/20
మాదాపూర్ హైటెక్స్లో ‘ఈ-మోటార్ షో’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ-బైక్ను నడిపి పనితీరును పరిశీలించారు.
18/20
కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మేనన్ కథానాయిక.ఈ సినిమా ట్రైలర్ను ఫిబ్రవరి 08 సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
19/20
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా... శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మాతలు.ఈ చిత్రం టీజర్ ఫిబ్రవరి 9న సాయంత్రం 4:00గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
20/20
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిబిరాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు