News in Pics: చిత్రం చెప్పే సంగతులు -02(20-03-2023)
Updated : 20 Mar 2023 21:14 IST
1/27
హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ-హబ్లో తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్, టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. కళాకారుల నృత్యాలు, ర్యాంప్వాక్లు ఆకట్టుకున్నాయి.
2/27
అవార్డుల ప్రదానోత్సవంలో మెరిసిన మోడల్
3/27
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్లో ‘హెడ్ ఇంజ్యూరీ అవేర్నెస్ టాక్ అండ్ సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ పోలీస్ పర్సనల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోలీసులకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.
4/27
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఎన్బీకే 108’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుందని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ను ట్విటర్ వేదికగా పంచుకుంది..
5/27
నాని, కీర్తి సురేశ్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కీర్తి సురేశ్ ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ‘వెన్నెల’ పాత్రలో కనిపించనున్నారు.
6/27
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ కీలక పాత్రల్లో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సందర్భంగా వేణు, ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్.. ప్రముఖ సినీనటుడు రామ్చరణ్ను కలిశారు. రామ్చరణ్ ‘బలగం’ సినిమా బాగుందని చిత్రబృందానికి కితాబిచ్చారు.
7/27
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రకాశ్రాజ్.. ‘సారంగి’ అనే పడవ నడిపే వ్యక్తి పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్ను ట్విటర్ వేదికగా పంచుకుంది.
8/27
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఏందే ఏందే’ పాట ప్రోమోను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పూర్తి పాటను 24న లాంచ్ చేస్తున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
9/27
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట నుంచి ప్రారంభమైంది. యాత్రలో భాగంగా లోకేశ్ మోటుకుపల్లిలో చిన్నారులను కలిసి ముచ్చటించారు.
10/27
నాని (Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ముంబయి వెళ్లిన నాని అక్కడి స్టైల్లో ఆటో దిగుతూ కనిపించారు.
11/27
ఇటీవల పట్టభద్రుల కోటాలో గెలిచిన తెదేపా ఎమ్మెల్సీలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పంచుకున్న ఆయన.. ‘కష్టపడి పని చేయండి.. మంచి పేరు తెచ్చుకోండి’ అని పోస్టు పెట్టారు.
12/27
రవితేజ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’అనే మాస్ సాంగ్ను మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
13/27
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ కీలక పాత్రల్లో జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా వేణు, ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాను కలిశారు. ఆయన ‘బలగం’ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
14/27
వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఈరోజు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటనష్టానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
15/27
సల్మాన్ ఖాన్(Salman Khan)- పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాడిన పాట టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. మంగళవారం పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
16/27
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ఈ సినిమా షూటింగ్ కోసం వరుణ్ తేజ్ సిద్ధమవుతున్న ఓ ఫొటోను చిత్రబృందం ట్వీట్ చేసింది.
17/27
తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.
18/27
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన పాఠశాలలోని తరగతి గదిలో స్కూల్ ఛైర్మన్ మోతె కిష్టయ్య తడిసిన మిర్చిని ఆరబోశారు. సొంత అవసరాలకు పాఠశాలను ఉపయోగించుకోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
19/27
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించిన చిత్రం ‘కోస్టి’. యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ‘కోస్టి’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్ను విడుదల చేసింది.
20/27
‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ (World Sparrow Day) సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. పిచ్చుకల ఫొటోలు పోస్టు చేస్తూ.. ‘మనలో ఎంతమందికి మన చిన్ననాటి నేస్తమైన పిచ్చుక గుర్తుకుంది. కారణం ఏదైనా కావచ్చు, ఈ అందమైన జీవులు ప్రస్తుతం కనిపించడం లేదు. మనకు, ప్రకృతికి మేలు చేసే పిచ్చుకలను బతకనిద్దాం.’ అంటూ ట్వీట్ చేశారు.
21/27
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్’(Meter). అతుల్య రవి కథానాయిక. సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సింబియాసిస్ లా స్కూల్లో నిర్వహించిన యాన్యువల్ ఫెస్ట్కు చిత్ర నటీనటులు హాజరై సందడి చేశారు.
22/27
‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ (World Sparrow Day)సందర్భంగా గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరిలోని రాజ్నివాస్లో పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు. పిచ్చుకలను సంరక్షించేందుకు కృషి చేయాలని కోరారు.
23/27
నాగశౌర్య హీరోగా పవన్ బాసంసెట్టి దర్శకత్వంలో ఓ సినిమా ‘ఎన్ఎస్ 23’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ఈ నెల 22న ఉగాది కానుకగా సినిమా టైటిల్ను ఖరారు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
24/27
హీరో విశ్వక్సేన్ తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘దస్ కా దమ్కీ’ మార్చి 22న విడుదలకు సిద్ధమైంది. నివేదా పేతురాజ్ కథానాయికగా యాక్షన్- కామెడీ తరహాలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
25/27
నటుడు మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు.
26/27
నటుడు నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. కాగా నాని తన ట్విటర్ ఖాతాలో ‘10 డేస్ టు గో’ అంటూ పోస్టు చేశారు.
27/27
నయన్ విఘ్నేశ్లు తమ పిల్లలతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఆనందం అనేది మనకు ఇష్టమైన వారితో ఉన్నప్పుడు జరిగే ప్రతిదానితో ముడిపడి ఉంటుంది.ప్రేమే ఆనందం, ఆనందమే ప్రేమ’ అంటూ క్యాప్షన్ జత చేశారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు