News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (26-03-2023)

Updated : 26 Mar 2023 22:28 IST
1/27
జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారంట్‌ను సినీనటి సిమ్రన్‌ చౌదరి, శాన్వీ మేఘన, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మలు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారంట్‌ను సినీనటి సిమ్రన్‌ చౌదరి, శాన్వీ మేఘన, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మలు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
2/27
 నటి శాన్వీ మేఘన నటి శాన్వీ మేఘన
3/27
తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
4/27
వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌, ఆర్సీబీ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఇలా నృత్యం చేస్తూ ఆర్సీబీ క్రికెటర్లలో జోష్‌ పెంచారు. ఆయన్ను ఆర్సీబీ జట్టు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చేర్చుకుంది. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌, ఆర్సీబీ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఇలా నృత్యం చేస్తూ ఆర్సీబీ క్రికెటర్లలో జోష్‌ పెంచారు. ఆయన్ను ఆర్సీబీ జట్టు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చేర్చుకుంది.
5/27
6/27
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆమెను అభినందించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆమెను అభినందించారు.
7/27
విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా ఆర్కే బీచ్‌రోడ్డులో ‘విశాఖ కార్నివాల్’ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారులు, నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా ఆర్కే బీచ్‌రోడ్డులో ‘విశాఖ కార్నివాల్’ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారులు, నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
8/27
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన మాస్‌ లుక్‌లో కనిపించారు. సినిమాను జనవరి 13, 2024న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన మాస్‌ లుక్‌లో కనిపించారు. సినిమాను జనవరి 13, 2024న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
9/27
భారత క్రికెటర్‌ అశ్విన్‌ తన తాజా ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చెస్‌ ఆడుతూ కొబ్బరి బొండాం తాగుతుంటే వచ్చే మజా వేరే అని తెలుపుతూ పోస్టు పెట్టారు. భారత క్రికెటర్‌ అశ్విన్‌ తన తాజా ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చెస్‌ ఆడుతూ కొబ్బరి బొండాం తాగుతుంటే వచ్చే మజా వేరే అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
10/27
భారత క్రికెటర్‌ రోహిత్‌శర్మ తన సతీమణి రితికతో దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. జోడీ బాగుందని కితాబిస్తూ ఆయన ఫ్యాన్స్‌ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. భారత క్రికెటర్‌ రోహిత్‌శర్మ తన సతీమణి రితికతో దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. జోడీ బాగుందని కితాబిస్తూ ఆయన ఫ్యాన్స్‌ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు.
11/27
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో వేపదారు శివలింగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో వేపదారు శివలింగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
12/27
వరుణ్‌తేజ్‌ హీరోగా శక్తిప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీటీ 13’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ఇలా మేకోవర్‌ అయ్యారు. వరుణ్‌తేజ్‌ హీరోగా శక్తిప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీటీ 13’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ఇలా మేకోవర్‌ అయ్యారు.
13/27
సినీనటి మీనాక్షి చౌదరి ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ ప్రారంభ కార్యక్రమంలో ఇలా మెరిశారు. ఈ ఫొటోలను పలువురు ట్విటర్‌లో పంచుకోగా ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. సినీనటి మీనాక్షి చౌదరి ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ ప్రారంభ కార్యక్రమంలో ఇలా మెరిశారు. ఈ ఫొటోలను పలువురు ట్విటర్‌లో పంచుకోగా ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
14/27
15/27
సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను ఈ నెల 28న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను ఈ నెల 28న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
16/27
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌ను మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, శ్రీశాంత్‌ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న రైనా.. ‘ఇదంతా సోదరభావం.. మన మనసు ఎవరిని ఇష్టపడుతుందో అదే కుటుంబం.. మా సోదరుడు త్వరగా కోలుకోవాలి’ అని పోస్టు పెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌ను మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, శ్రీశాంత్‌ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్న రైనా.. ‘ఇదంతా సోదరభావం.. మన మనసు ఎవరిని ఇష్టపడుతుందో అదే కుటుంబం.. మా సోదరుడు త్వరగా కోలుకోవాలి’ అని పోస్టు పెట్టారు.
17/27
సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ నేపథ్యంలో సుజిత్‌.. సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఏఎస్‌ ప్రకాశ్‌తో కలిసి షూటింగ్‌ లొకేషన్స్‌ వెతికే పనిలో నిమగ్నమయ్యారు. సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ నేపథ్యంలో సుజిత్‌.. సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఏఎస్‌ ప్రకాశ్‌తో కలిసి షూటింగ్‌ లొకేషన్స్‌ వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
18/27
పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
19/27
‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ మార్చి 31 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ మార్చి 31 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు.
20/27
బెంగళూరులో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో సినీనటి ఈషా రెబ్బా ఇలా మెరిశారు. బెంగళూరులో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో సినీనటి ఈషా రెబ్బా ఇలా మెరిశారు.
21/27
22/27
సుడిగాలి సుధీర్‌ ప్రముఖ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సుధీర్ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సుడిగాలి సుధీర్‌ ప్రముఖ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సుధీర్ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
23/27
సినీనటుడు ఎన్టీఆర్‌ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి ఇన్‌స్టా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్ములు’ అని తెలుపుతూ ఈ ఫొటోను పంచుకున్నారు. సినీనటుడు ఎన్టీఆర్‌ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి ఇన్‌స్టా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్ములు’ అని తెలుపుతూ ఈ ఫొటోను పంచుకున్నారు.
24/27
హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో ‘కిడ్స్ మార‌థాన్‌’ నిర్వహించారు. ఈ రన్‌ను పీటీ ఉష జెండా ఊపి ప్రారంభించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో ‘కిడ్స్ మార‌థాన్‌’ నిర్వహించారు. ఈ రన్‌ను పీటీ ఉష జెండా ఊపి ప్రారంభించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
25/27
హైదరాబాద్‌లో ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
26/27
తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
27/27
విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా అక్కడి ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె మారథాన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించగా నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా అక్కడి ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె మారథాన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించగా నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని