News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(27-03-2023)

Updated : 27 Mar 2023 22:26 IST
1/30
సినీనటి రష్మిక మంధాన తన తాజా ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘నేను వేసుకున్న కొత్త డ్రెస్‌’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. సినీనటి రష్మిక మంధాన తన తాజా ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘నేను వేసుకున్న కొత్త డ్రెస్‌’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
2/30
విశాఖపట్నంలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీనిలో భాగంగా కురుపాం కూడలి, ఆర్కే బీచ్‌ రహదారిని ఇలా విద్యుత్తు కాంతులతో సుందరంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీనిలో భాగంగా కురుపాం కూడలి, ఆర్కే బీచ్‌ రహదారిని ఇలా విద్యుత్తు కాంతులతో సుందరంగా ఏర్పాటు చేశారు.
3/30
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను శాలువాతో సత్కరించి.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను శాలువాతో సత్కరించి.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
4/30
ఈ చిత్రం చూస్తే.. భయంకరమైన భారీ చేప మింగేలా నోరు తెరుచుకొని ఉన్నట్లుంది కదూ..  కూకట్‌పల్లి మెట్రో పార్కింగ్‌ వద్ద  పిల్లల కోసం ఓ ఎగ్జిబిషన్‌ ప్రధాన ద్వారాన్ని ఇలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రం చూస్తే.. భయంకరమైన భారీ చేప మింగేలా నోరు తెరుచుకొని ఉన్నట్లుంది కదూ.. కూకట్‌పల్లి మెట్రో పార్కింగ్‌ వద్ద పిల్లల కోసం ఓ ఎగ్జిబిషన్‌ ప్రధాన ద్వారాన్ని ఇలా ఏర్పాటు చేస్తున్నారు.
5/30
విశాఖపట్నంలో మంగళవారం నుంచి జరగనున్న జీ20 సదస్సుకు రాడిసన్‌ బ్లూ హోటల్‌ వేదికైంది. దీంతో ఆ హోటల్‌ పరిసర ప్రాంతాలను అందంగా అలంకరించారు.  వివిధ దేశాల జెండాలతో అక్కడ ముస్తాబు చేశారు.  పూల బుట్టలు, వికసించిన కమలం, సీతకొండపై రంగుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నంలో మంగళవారం నుంచి జరగనున్న జీ20 సదస్సుకు రాడిసన్‌ బ్లూ హోటల్‌ వేదికైంది. దీంతో ఆ హోటల్‌ పరిసర ప్రాంతాలను అందంగా అలంకరించారు. వివిధ దేశాల జెండాలతో అక్కడ ముస్తాబు చేశారు. పూల బుట్టలు, వికసించిన కమలం, సీతకొండపై రంగుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
6/30
ఈజిప్టులో 2వేలకుపైగా గొర్రెల పుర్రెలు బయటపడ్డాయి. అక్కడి రామ్‌సెస్‌ 2 దేవాలయం వద్ద తవ్వకాలు చేపట్టగా ఇవి వెలుగులోకి వచ్చాయి. ఈ జంతువులను ఇక్కడ సుమారు వెయ్యేళ్ల క్రితం బలిచ్చినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈజిప్టులో 2వేలకుపైగా గొర్రెల పుర్రెలు బయటపడ్డాయి. అక్కడి రామ్‌సెస్‌ 2 దేవాలయం వద్ద తవ్వకాలు చేపట్టగా ఇవి వెలుగులోకి వచ్చాయి. ఈ జంతువులను ఇక్కడ సుమారు వెయ్యేళ్ల క్రితం బలిచ్చినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
7/30
కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram), అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’(Meter). ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి వరంగల్‌లోని నిట్‌ కళాశాలను సందర్శించారు. సినిమాకు సంబంధించిన విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram), అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’(Meter). ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి వరంగల్‌లోని నిట్‌ కళాశాలను సందర్శించారు. సినిమాకు సంబంధించిన విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు.
8/30
విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకుంటున్న నటీనటులు విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకుంటున్న నటీనటులు
9/30
రామ్‌ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబరు 20న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఈ పోస్టర్‌ను పంచుకుంది. రామ్‌ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబరు 20న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఈ పోస్టర్‌ను పంచుకుంది.
10/30
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈ నెల 28న  208 మంది దివ్యాంగులకు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ద్విచక్రవాహనాలను అందజేయనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలను సిద్ధం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈ నెల 28న 208 మంది దివ్యాంగులకు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ద్విచక్రవాహనాలను అందజేయనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలను సిద్ధం చేశారు.
11/30
నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలోని ఫోర్త్‌ సింగిల్‌ ‘ఓ అమ్మలాలో అమ్మలాలో’ పాటను మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలోని ఫోర్త్‌ సింగిల్‌ ‘ఓ అమ్మలాలో అమ్మలాలో’ పాటను మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
12/30
మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో భవానీ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘మిస్టర్ బ్రహ్మ ఏంటీ డ్రామా’. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో భవానీ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘మిస్టర్ బ్రహ్మ ఏంటీ డ్రామా’. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/30
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రల్లో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ఈ సినిమా మార్చి 3న విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వేణుని సత్కరించారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువట్టద్దంలా ‘బలగం’ చిత్రాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రల్లో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ఈ సినిమా మార్చి 3న విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వేణుని సత్కరించారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువట్టద్దంలా ‘బలగం’ చిత్రాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు.
14/30
విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ను ఈ నెల 29న చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించింది. విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ను ఈ నెల 29న చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించింది.
15/30
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పశ్చిమ బెంగాల్‌లో  పర్యటించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ భవన్‌ను సందర్శించి సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ మార్గాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ భవన్‌ను సందర్శించి సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ మార్గాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు..
16/30
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదిర గ్రామంలో దళితబంధు పథకం లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య  కలిసి రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ఈ మిల్లు ప్రారంభోత్సవంలో పాల్గొని మరపట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదిర గ్రామంలో దళితబంధు పథకం లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య కలిసి రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ఈ మిల్లు ప్రారంభోత్సవంలో పాల్గొని మరపట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
17/30
రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ ఫొటోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ ఫొటోను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.
18/30
రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నేడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నేడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది.
19/30
తిరుమలలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి. ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తిరుమలలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి. ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
20/30
నితిన్‌, నిత్యామీనన్‌ జంటగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్‌’. 2012లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నెల 29 నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. రీరిలీజ్‌ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నితిన్‌, నిత్యామీనన్‌ జంటగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్‌’. 2012లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నెల 29 నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. రీరిలీజ్‌ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
21/30
సినీనటి నభా నటేశ్‌ తన తాజా ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు.. సినీనటి నభా నటేశ్‌ తన తాజా ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు..
22/30
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తన ముంబయి ఇండియన్స్‌ జెర్సీని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తన ముంబయి ఇండియన్స్‌ జెర్సీని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.
23/30
ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రికను వారు సీఎంకు అందజేసి వేడుకలకు రావాల్సిందిగా కోరారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. ఒంటిమిట్ట సీతారామ కల్యాణానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రికను వారు సీఎంకు అందజేసి వేడుకలకు రావాల్సిందిగా కోరారు.
24/30
అత్యాధునికమైన  16 ఏసీ స్లీపర్ ‘లహరి’ బస్సులను టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar), ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్(Sajjanar) ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అత్యాధునికమైన 16 ఏసీ స్లీపర్ ‘లహరి’ బస్సులను టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar), ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్(Sajjanar) ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
25/30
అత్యాధునిక సదుపాయాలతో బస్సులో ఏర్పాటు చేసిన ఇంటీరియర్‌.. అత్యాధునిక సదుపాయాలతో బస్సులో ఏర్పాటు చేసిన ఇంటీరియర్‌..
26/30
బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ దంపతులకు కుమార్తె జన్మించింది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్‌..  ‘దేవుడు నాకు కుమార్తె రూపంలో సంతోషాన్ని అందించాడు’ అంటూ ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా సోమవారం పంచుకున్నారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ దంపతులకు కుమార్తె జన్మించింది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్‌.. ‘దేవుడు నాకు కుమార్తె రూపంలో సంతోషాన్ని అందించాడు’ అంటూ ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా సోమవారం పంచుకున్నారు.
27/30
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చరణ్‌ను ముద్దాడుతున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ఐ యామ్‌ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.  మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చరణ్‌ను ముద్దాడుతున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘ఐ యామ్‌ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.
28/30
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు(సోమవారం) స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు(సోమవారం) స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
29/30
స్వామి వారి రథోత్సవానికి విచ్చేసిన భక్తులు.. స్వామి వారి రథోత్సవానికి విచ్చేసిన భక్తులు..
30/30
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌తో గతంలో, ఇటీవల దిగిన ఫొటోలను సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌తో గతంలో, ఇటీవల దిగిన ఫొటోలను సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

మరిన్ని