News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(31-03-2023)
Updated : 31 Mar 2023 22:23 IST
1/23
మాదాపూర్లోని సీసీఆర్టీలో కళాకారుల కూచిపూడి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు.
2/23
ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో సన్రైజర్స్కు చెందిన బ్రియాన్ లారా, భువనేశ్వర్ హైదరాబాద్ ఉప్పల్లోని పిచ్ను పరిశీలించారు.
3/23
ఐపీఎల్-16 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. అంతకు ముందు టాస్ నెగ్గిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మ్యాచ్కు ముందు జీటీ, సీఎస్కే జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్య, ధోనీ ఇలా మాట్లాడుకుంటూ కనిపించారు.
4/23
ఇటీవల అస్వస్థతకు గురైన పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
5/23
రాప్తాడు నియోజకవర్గంలో సాగుతున్న ‘యువగళం’ పాదయాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో కలిసి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఇలా విజకేతనాన్ని చూపారు.
6/23
బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కజకిస్థాన్ క్రీడాకారులు ఈత కొలనులో నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి సినీనటుడు సుమంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
7/23
ప్రముఖ సినీనటుడు కృష్ణ.. కౌబాయ్ పాత్రలో నటించి అలరించిన సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ సినిమాను మే 31న కృష్ణ జయంతి సందర్భంగా రీరిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
8/23
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి సినీనటి ప్రగ్యా జైస్వాల్ హాజరై నూతన ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
9/23
భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
10/23
శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మాడిఫై చేసిన వాహనాల సైలెన్సర్లను నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 420 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
11/23
నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నాని ఓ ఆసక్తికర ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘జెర్సీ’ సినిమా ఇంటర్వెల్ సీన్లో విజయోత్సాహంతో అరిచే తన ఫొటోకు.. దసరా సినిమా క్లైమాక్స్లో వినియోగించిన గొడ్డళ్లను జత చేశారు. ఎలా ఉంది మరి.. ఈ దసరా గొడ్డలి.. జెర్సీ ఎమోషన్.
12/23
రామ్చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరెంజ్’ సినిమా 2010లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మార్చి 27న రామ్చరణ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. కాగా రీరిలీజ్లో ఈ చిత్రం రూ.3కోట్ల వసూళ్లు సాధించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగుతోంది.
13/23
ఆర్సీబీ జట్టు ఆటగాడు దినేశ్ కార్తిక్.. డుప్లెసిస్తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోపై కామెంట్ చేయమంటూ ఫాలోవర్లకు సూచించారు. ఐపీఎల్ సీజన్ 16 నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
14/23
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రెండో శుక్రవారం శ్రీనగర్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
15/23
సినీనటి ఆకాంక్ష సింగ్ తన తాజా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
16/23
ఆస్కార్ పురస్కారాన్ని సాధించిన భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్లు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వారికి అభినందనలు తెలిపారు.
17/23
ముంబయిలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు ఇలా మెరిశారు.
18/23
సమంత, దేవ్మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘మల్లిక.. మల్లిక’ పాటను చిత్రబృందం విడుదల చేసింది.
19/23
సాయిధరమ్తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది. ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
20/23
నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా మొదటి రోజు రూ.38కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
21/23
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్బీకే 108’(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. టైటిల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పింది.
22/23
భద్రాద్రి రామయ్య దేవస్థానంలో జరుగుతోన్న పుష్కర మహా పట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
23/23
కడపలోని పెద్ద దర్గాను తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు అనిల్ కుమార్ సందర్శించారు. తన సోదరుడు కిరణ్ కుమార్తో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు