News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (01-04-2023)

Updated : 01 Apr 2023 22:28 IST
1/32
రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. చిత్ర నటీమణులు మేఘా ఆకాశ్‌, దక్ష తళుక్కున మెరిశారు. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. చిత్ర నటీమణులు మేఘా ఆకాశ్‌, దక్ష తళుక్కున మెరిశారు.
2/32
అందాల తార దక్ష అందాల తార దక్ష
3/32
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల కల్యాణ నృత్య రూపకం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను సన్మానించారు.. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల కల్యాణ నృత్య రూపకం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను సన్మానించారు..
4/32
5/32
తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
6/32
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కార్బెట్‌లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ను ప్రకటించి ఈరోజుకి 50 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అప్పటి ఇందిరా గాంధీ  చిత్రాలను ట్విటర్‌లో పంచుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ టైగర్‌ రిజర్వులకు ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ.. ఆయన ట్వీట్‌ చేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కార్బెట్‌లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ను ప్రకటించి ఈరోజుకి 50 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అప్పటి ఇందిరా గాంధీ చిత్రాలను ట్విటర్‌లో పంచుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ టైగర్‌ రిజర్వులకు ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావిస్తూ.. ఆయన ట్వీట్‌ చేశారు.
7/32
8/32
నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు మహిళలు బెలూన్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ అక్కడి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు మహిళలు బెలూన్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు.
9/32
సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. కొచిలో ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర జోడీ ఇలా నవ్వుతూ కనిపించారు. సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. కొచిలో ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర జోడీ ఇలా నవ్వుతూ కనిపించారు.
10/32
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నుంచి దిల్లీకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నుంచి దిల్లీకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు.
11/32
ఐపీఎల్‌ 2023లో భాగంగా ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్లు ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశాయి. ఐపీఎల్‌ 2023లో భాగంగా ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తపడనున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్లు ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశాయి.
12/32
ప్రాక్టీస్‌ చేస్తున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఆటగాళ్లు
13/32
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది.
14/32
కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన ఓ పార్కును మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. అనంతరం పార్కులోని వివిధ పరికరాలను ఆయన పరిశీలించారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన ఓ పార్కును మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. అనంతరం పార్కులోని వివిధ పరికరాలను ఆయన పరిశీలించారు.
15/32
తిరుమలలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వేసవి కారణంగా మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కారుమేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. దీంతో భక్తులు తడిచి ముద్దయ్యారు. తిరు వీధులు, ఆలయం ఎదుట వర్షపు నీరు ప్రవహించింది. తిరుమలలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వేసవి కారణంగా మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కారుమేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. దీంతో భక్తులు తడిచి ముద్దయ్యారు. తిరు వీధులు, ఆలయం ఎదుట వర్షపు నీరు ప్రవహించింది.
16/32
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
17/32
ఫొటోలో కనిపిస్తోంది కీవ్‌లో ధ్వంసమైన ‘ఆంటోనోవ్‌ ఏఎన్‌-225’ విమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా ప్రసిద్ధి చెందిన ‘ఆంటోనోవ్‌ ఏఎన్‌-225’ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ఇలా తయారైంది. ఫొటోలో కనిపిస్తోంది కీవ్‌లో ధ్వంసమైన ‘ఆంటోనోవ్‌ ఏఎన్‌-225’ విమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా ప్రసిద్ధి చెందిన ‘ఆంటోనోవ్‌ ఏఎన్‌-225’ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ఇలా తయారైంది.
18/32
కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నటీనటులు హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఆర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నటీనటులు హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఆర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు.
19/32
ప్రముఖ నటుడు సూర్య, జ్యోతిక దంపతులు తమిళనాడులోని కీజాడి పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఫొటో దిగి సందడి చేశారు. ప్రముఖ నటుడు సూర్య, జ్యోతిక దంపతులు తమిళనాడులోని కీజాడి పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఫొటో దిగి సందడి చేశారు.
20/32
అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన పోప్‌ ఫ్రాన్సిస్‌ కోలుకున్నారు. ఈ సందర్భంగా రోమ్‌లోని అగోస్టినో జెమెల్లీ యూనివర్సిటీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ఆయన ఓ బాలుడి చేతికట్టుపై ఇలా సంతకం చేశారు. అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన పోప్‌ ఫ్రాన్సిస్‌ కోలుకున్నారు. ఈ సందర్భంగా రోమ్‌లోని అగోస్టినో జెమెల్లీ యూనివర్సిటీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ఆయన ఓ బాలుడి చేతికట్టుపై ఇలా సంతకం చేశారు.
21/32
సునీల్‌ (Sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’ (Bhuvana Vijayam). యలమంద చరణ్‌ దర్శకుడు.  ఈ సినిమాకు సంబంధించిన ‘కథన.. కదనమున..’అనే వీడియో సాంగ్‌ను ఏప్రిల్‌ 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన చిత్రటీజర్‌ ఆకట్టుకుంటోంది. సునీల్‌ (Sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’ (Bhuvana Vijayam). యలమంద చరణ్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ‘కథన.. కదనమున..’అనే వీడియో సాంగ్‌ను ఏప్రిల్‌ 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన చిత్రటీజర్‌ ఆకట్టుకుంటోంది.
22/32
సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొచిలో నిర్వహించిన ప్రైస్‌మీట్‌లో సమంత ఇలా మెరిశారు. సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొచిలో నిర్వహించిన ప్రైస్‌మీట్‌లో సమంత ఇలా మెరిశారు.
23/32
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణవాసులు ఉత్సాహంగా పాల్గొని సైక్లింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణవాసులు ఉత్సాహంగా పాల్గొని సైక్లింగ్‌ చేశారు.
24/32
తన తండ్రి, ప్రముఖ నటుడు రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను సౌందర్య రజనీకాంత్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘తలైవా కొత్త లుక్‌ అదిరిపోయింది’ అంటూ పోస్టు పెట్టారు. తన తండ్రి, ప్రముఖ నటుడు రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను సౌందర్య రజనీకాంత్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘తలైవా కొత్త లుక్‌ అదిరిపోయింది’ అంటూ పోస్టు పెట్టారు.
25/32
సినీనటి జాన్వీకపూర్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌ 30’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినీనటి జాన్వీకపూర్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌ 30’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
26/32
సినీనటి అదా శర్మ తన చిన్ననాటి ఫొటోతో పాటు ప్రస్తుత ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అప్పుడు, ఇప్పుడు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. అప్పుడు, ఇప్పుడు బాగున్నారంటూ పోస్టు కింద పలువురు ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. సినీనటి అదా శర్మ తన చిన్ననాటి ఫొటోతో పాటు ప్రస్తుత ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అప్పుడు, ఇప్పుడు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. అప్పుడు, ఇప్పుడు బాగున్నారంటూ పోస్టు కింద పలువురు ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.
27/32
భద్రాద్రి సీతారాముల ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు. భద్రాద్రి సీతారాముల ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు.
28/32
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నటులు వెంకటేశ్‌, నాగార్జున అక్కడ కీరవాణిని కలిసి అభినందనలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నటులు వెంకటేశ్‌, నాగార్జున అక్కడ కీరవాణిని కలిసి అభినందనలు తెలిపారు.
29/32
బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలో ఆమెను కలిసి సత్కరించారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలో ఆమెను కలిసి సత్కరించారు.
30/32
నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా రెండు రోజుల్లో రూ.53కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా రెండు రోజుల్లో రూ.53కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
31/32
సాయిధరమ్‌తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాను ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాను ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
32/32
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి’ సినిమా 2003లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా రీరిలీజ్‌ తేదీని ఏప్రిల్‌ 9న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి’ సినిమా 2003లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా రీరిలీజ్‌ తేదీని ఏప్రిల్‌ 9న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

మరిన్ని