News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 02(18-04-2023)
Updated : 18 Apr 2023 22:24 IST
1/25
హైదరాబాద్లో రంజాన్ మాసం ఘనంగా నిర్వహిస్తున్నారు. చార్మినార్, మక్కా మసీదులో జెగినేకి రాత్ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నాయి. రాత్ బజార్లో సందడి వాతావరణం నెలకొంది.
2/25
నటి రష్మిక తన తాజా ఫొటోలను ట్విటర్లో పంచుకున్నారు. ఓ యాడ్ షూట్లో పాల్గొన్నట్లు తెలుపుతూ పోస్టు చేశారు. ఈ ఫొటోలో తెలుపు రంగు దుస్తుల్లో ఆమె అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు అభిమానులు ఖుషీ అవుతున్నారు.
3/25
హైదరాబాద్, ముంబయి జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా స్టేడియంలో సందడి చేస్తున్న జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, యాంకర్ వర్షిణి
4/25
ఐపీఎల్ 16లో భాగంగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్, ముంబయి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. స్టేడియంలో ఈ మ్యాచ్ను నిర్మాత సురేశ్ బాబు వీక్షిస్తూ.. హైదరాబాద్ జట్టు సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు.
5/25
రంజాన్ మాసం సందర్భంగా కడప పెద్దదర్గాలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
6/25
తన మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన వేడుకలో హిమన్షు రావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నారు. అనంతరం తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకున్నారు.
7/25
ఐపీఎల్ 16లో భాగంగా మంగళవారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ముంబయి జట్లు తలపడుతున్నాయి. ఈ సందర్భంగా స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. యువతులు జెండాలు ఊపుతూ.. హైదరాబాద్ జట్టు సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు.
8/25
జూబ్లీహిల్స్లో అంటోరా స్టోర్ను మంచు లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటీమణులు రెబ్బా మౌనిక జాన్, సీరత్ కపూర్, ఇతర తారలు నూతన వస్త్రాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
9/25
రెబ్బా మౌనిక జాన్..
10/25
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామబాణం’. డింపుల్ హయాతి కథానాయిక. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ను ఏప్రిల్ 20న రాజమహేంద్రవరంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఖుష్బూ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు.
11/25
నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. ఇందులోని జానపద సాహిత్యం నేపథ్యంలో రూపొందించిన 'మైనీరు పిల్లగాడా' వీడియో సాంగ్ను ఏప్రిల్ 19న ఉదయం 11 గంటలకు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
12/25
విజయవాడలో హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటీమణులు కామాక్షి భాస్కర్ల, ఊర్మిళా చౌహాన్, మోడల్స్ ఫొటోలు దిగి సందడి చేశారు.
13/25
ఫొటోలకు పోజులిస్తున్న నటి ఊర్మిళా చౌహాన్
14/25
ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో న్యాయవ్యవస్థను సరిదిద్దడానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపారు. ఈ నిరసనలో పదివేల మంది ఇలా ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు.
15/25
స్విట్జర్లాండ్లో మహిళల వీల్ఛైర్ అథ్లెట్ మాన్యులా షార్ 127వ బోస్టన్ మారథాన్ను ప్రారంభించారు. అధికసంఖ్యలో వచ్చిన ప్రజలు ఉత్సాహంగా ఈ మారథాన్ను తిలకించారు.
16/25
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగింది. ఈ సందర్భంగా మైదానంలో ఎంఎస్ ధోనీని ఆత్మీయంగా కౌగిలించుకున్న ఫొటోను కోహ్లీ ట్విటర్లో పంచుకున్నాడు. ఈ ఫొటో చూసిన అభిమానులు సంబరపడుతున్నారు.
17/25
కడపలో తెదేపా ఆధ్వర్యంలో జోన్ 5 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఘనంగా సత్కరించారు.
18/25
కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్ 2’. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ కమల్హాసన్తో దిగిన ఫొటోను శంకర్ ట్విటర్లో పంచుకున్నారు. ‘ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేయడానికి సహకరించిన కమల్ హాసన్ సర్కి ధన్యవాదాలు, మళ్లీ కలుద్దాం’. అని ట్వీట్ చేశారు.
19/25
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘చలో ఇందిరా పార్క్’ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ముచ్చటిస్తూ కనిపించారు.
20/25
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2)’. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించిన ఈవెంట్లో నటి త్రిష తళుక్కున మెరిశారు.
21/25
సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంయుక్త ఇలా మెరిశారు.
22/25
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 100 రోజుల వేడుకను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
23/25
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్ - They call him OG). ఈ సినిమా షూటింగ్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
24/25
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామబాణం’. డింపుల్ హయాతి కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 20న రాజమహేంద్రవరంలో జరగనున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది.
25/25
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం(ఎన్టీఆర్30) తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ను చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నట్లు తెలుపుతూ ఫొటోలను ట్వీట్ చేసింది. ఈ ఫొటోను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి