News In Pics: చిత్రం చెప్పే విశేషాలు
Updated : 26 May 2022 18:54 IST
1/26
హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రధానికి ‘సిలప్పదికారం’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
2/26
ముంబయిలోని ఓ నీటి కొలను వద్ద ఫ్లెమింగోలు గుంపులుగా ఆహారం కోసం వెతుకుతూ కనిపించాయి.
3/26
4/26
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆస్ర్టేలియా నటి ఒలివియా డీజొంగ్ నలుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
5/26
6/26
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఐడియల్ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంతో పాటు చీరకట్టులో ర్యాంప్వాక్ చేసి ఆకట్టుకున్నారు.
7/26
8/26
తితిదే గురువారం జీడిపప్పును ముక్కలుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్-2లో తితిదే ఈవో ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. తిరుమలలో ప్రతిరోజు ప్రసాదాల తయారీకి 3,500కిలోల నుంచి 4వేల కిలోల వరకు జీడిపప్పు ముక్కలు అవసరమవుతాయని ఆయన తెలిపారు.
9/26
10/26
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి అమీర్పేటలోని 50పడకల ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరాతీశారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని హరీశ్రావు అన్నారు.
11/26
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైకాపా చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి’ బస్సుయాత్రను శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు.
12/26
13/26
14/26
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బేగంపేటలో సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన ఓ బాలుడు పేపర్పై భారత దేశ పటాన్ని గీసి అందులో మోదీ చిత్రాన్ని ఉంచి ప్రధానిపై తనకున్న అభిమానాన్ని చాటాడు.
15/26
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంతకు ముందు మోదీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
16/26
17/26
తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు పద్మనాభనగర్లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. దేవెగౌడతో పాటు కుమారస్వామి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ వారితో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
18/26
19/26
యుద్ధంలో దగ్ధమైన రష్యా యుద్ధ ట్యాంకులు, ఇతర సామగ్రితో ఉక్రెయిన్ దేశం కీవ్లోని మైకైలివిస్కా స్క్వేర్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
20/26
21/26
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే విభిన్న వస్ర్తధారణలో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
22/26
23/26
ఒంగోలులో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. మంగళగిరి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్లారు.
24/26
25/26
26/26
ఎండాకాలంలో నీటి కోసం జంతువులు, పక్షులు కుళాయిలు, బోర్ల వద్ద నీరు తాగేందుకు ప్రయత్నించడం సాధారణమే. కానీ ఈ పావురం మరో అడుగు ముందుకు వేసి చల్లటి నీరు మాత్రమే తాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ కనిపించింది. నారాయణగూడలోని ఓ ఇంటిలో అమర్చిన ఏసీ యంత్రం నుంచి బయటకు వచ్చిన నీటిని బొట్టు బొట్టు ఒడిసిపట్టి తాగింది.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!